విశాఖలో ట్రాఫిక్ జామ్: 30 మంది విద్యార్థులు JEE మెయిన్స్ పరీక్ష మిస్‌ JEE Mains 2025

JEE exam late entry issue

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో విశాఖలో ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్ వల్ల 30 మంది విద్యార్థులు JEE మెయిన్స్ JEE Mains 2025 పరీక్ష మిస్ అయ్యారు. బాధితుల కన్నీటి కథ చదవండి.

డిప్యూటీ సీఎం పర్యటన.. పరీక్షా కలలు భగ్నం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరకు పర్యటనకు వెళ్తుండగా, ఆయన కాన్వాయ్‌ (Pawan Kalyan convoy effect) కారణంగా విశాఖపట్నం–అరకు మార్గం లో భారీ ట్రాఫిక్ జామ్ (Visakhapatnam Traffic Jam) ఏర్పడింది. ఈ కారణంగా చిన్న ముసిరివాడ వద్ద ఉన్న అయాన్ డిజిటల్ సెంటర్ పరీక్షా కేంద్రానికి చేరాల్సిన విద్యార్థులు తీవ్రంగా ఆలస్యం అయ్యారు.

జీ మెయిన్స్‌ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఎంట్రీ లేదు

పరీక్షకు నిర్ణీత సమయానికి ముందు హాల్‌లోకి ప్రవేశించాల్సిన నిబంధన ఉండటంతో, ఆలస్యంగా వచ్చిన సుమారు 30 మంది విద్యార్థులకు అధికారులు అనుమతి నిరాకరించారు. పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయిన విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

పేరెంట్స్ కన్నీటి వర్షం

సహజంగానే, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులు ఈ ఘటనపై కన్నీటి పర్యంతమయ్యారు. “ఒకే ఒక్క పరీక్ష కోసం పిల్లలు రెండు సంవత్సరాలు కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వల్ల మేము ఇలా అవుతామనే ఊహించలేకపోయాం” అంటూ వారు వాపోయారు.

ప్రజల నుండి భగ్గుమన్న స్పందన

ఈ ఘటనపై స్థానిక ప్రజలు, నెటిజన్లు సోషల్ మీడియాలో VIP కాన్వాయ్‌లు సాధారణ ప్రజల జీవితాలపై చూపించే ప్రభావం గురించి ప్రశ్నిస్తున్నారు. “ప్రజాసేవకు వచ్చిన నాయకులే, ప్రజల భవిష్యత్తు నాశనం చేస్తే ఎలా?” అని మండిపడుతున్నారు.

ప్రభుత్వం స్పందించాలంటూ డిమాండ్

దీని వల్ల నష్టపోయిన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలంటూ, పలువురు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. JEE వంటి JEE Mains 2025 జాతీయ స్థాయి పరీక్షల్లో ఒక చిన్న ఆలస్యం ఎంతో ప్రభావం చూపుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

JEE exam late entry issue
JEE exam late entry issue

ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా? కింద కామెంట్ చేయండి & స్టోరీని షేర్ చేయండి – మీ గొంతు వినిపించండి!

Leave a Comment