TTD Book Prasadam : భక్తులకు శ్రీవారి పుస్తక ప్రసాదం

Sreevari Hand Books

తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారాన్ని TTD Book Prasadam బలపరిచేందుకు శ్రీవారి చేతి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. మతమార్పిడుల అరికట్టేందుకు దళితవాడలలో విస్తృతంగా పంపిణీ జరగనుంది.

భక్తులకు శ్రీవారి పుస్తక ప్రసాదం: మతమార్పిడులపై టీటీడీ వ్యూహాత్మక ధర్మ ప్రచారం. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు అందించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న సైజు పుస్తకాల రూపంలో హిందూ ధార్మిక ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టాలని టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు.

మతమార్పిడులను అరికట్టే ధార్మిక వ్యూహం
భారతదేశంలో మతమార్పిడులు పెరిగిపోతున్న దృష్ట్యా, వాటిని అడ్డుకునేందుకు హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా టీటీడీ కొత్త వ్యూహాన్ని చేపట్టింది. దళితవాడలపై ప్రత్యేక దృష్టితో వివిధ హిందూ గ్రంథాలు, స్తోత్రాలు, పురాణ విషయాలు ఉన్న చేతి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

పుస్తకాలలో ఏముంటుంది?

  • ఈ హ్యాండ్‌బుక్స్‌లో ఉన్నాయి:
  • శ్రీ వేంకటేశ్వర వైభవం
  • విష్ణు సహస్రనామం
  • శ్రీ సుప్రభాతం
  • భజగోవిందం
  • లలితా సహస్రనామం
  • శివ స్తోత్రాలు
  • భగవద్గీత
  • మహనీయుల చరిత్రలు

తిరుమలలోనూ పుస్తక ప్రసాదం
తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండే భక్తులకు కూడా ఈ హ్యాండ్‌బుక్స్ శ్రీవారి పుస్తక ప్రసాదంగా అందజేయనున్నట్లు చెప్పారు. ఇది భక్తుల్లో ఆధ్యాత్మికతను పెంచేందుకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

దాతల సహకారంతో భారీ ప్రచారం
ఈ పుస్తకాల ముద్రణకు టీటీడీ నిధులు వినియోగించకుండానే, అనేకమంది దాతల TTD Book Prasadam సహకారంతో కోట్లాది పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఈ ప్రచారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా నిర్వహించనున్నారు.

Leave a Comment