పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో సిబ్బంది వల్ల భక్తులు క్యూ లైన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Tirupatamma Temple ఫ్యాన్లు లేక ఉక్క పోతతో అల్లాడుతున్నమని వారు తెలిపారు. సంఘటనపై భక్తులు ఆలయ ఈవోపై చర్యలు కోరుతున్నారు.
పెనుగంచిపోలులో వేంచేసి వున్న తిరుపతమ్మ ఆలయంలో భక్తులు క్యూ లైన్లో ఉక్క పోతతో అల్లాడుతున్నామనీ, నిద్ర వశంలో సిబ్బంది ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సిబ్బంది ఎవరు ఏం చేస్తున్నారని అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. ఎండ వేడి ఉన్నప్పటికీ ఫ్యాన్లు సరైన రీతిలో ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దైవ దర్శనానికి వస్తే కొత్త కష్టాలు ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న సిబ్బందిపై ఆలయ ఈవో వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా చంటి పిల్లలతో ఉక్క పోసి, భక్తులు అల్లాడుతున్నట్లు సమాచారం. దీనిపై యుద్ధ ప్రాతిపాదికన సంబంధిత ప్రాంతానికి వెళ్లి సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని, సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారిని (ఈవో)ని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆలయ సిబ్బందిపై గ్రామస్తులు, భక్తులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. Tirupatamma Temple ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే భక్తులలో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.