తల్లికి వందనం ఎప్పుడు వస్తుందా అని ఎదరు చూస్తున్న వారికి Thalliki Vandanam శుభవార్త… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన విధంగానే జూన్ 12 స్కూల్స్ తెరిచే నాటికి తల్లుల ఖాతాలో డబ్బలు జమ కానున్నాయి. అయితే ఈ రెండు విషయాలు మాత్రం మర్చిపోవద్దు. లేదంటే మీ ఖాతాలో డబ్బలు పడవు. ఈ లోపు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదే ఈ రెండు విషయాలు తప్పకుండా చేసి ఉండాలి.
ఏపి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందనుంది. ఈ మొత్తాన్ని నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుంది.
ఎప్పడు ఇస్తారు అంటే..
జూన్ 12 నుంచి పాఠశాలలు తెరిచే ముందే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది. ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అప్పడే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. మొదటిది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానం కావాల్సి ఉంది. రెండవది బ్యాంకు ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో లింక్ చేయడం కూడా తప్పనిసరి చేసింది. ఈ రెండు లింకులు లేకపోతే, రూ.15,000 ఆర్థిక సాయం జమ కాకపోవచ్చని అధికారులు ఇప్పటికే చెబుతున్నారు.
ఆధార్, ఎన్పీసీఐ లింక్ ఎందుకు తప్పనిసరి?
ప్రభుత్వం ఈ పథకం కింద నిధులను పారదర్శకంగా, సరైన లబ్ధిదారులకు చేరేలా చేయడానికి ఆధార్ మరియు ఎన్పీసీఐ లింకింగ్ను తప్పనిసరి చేసింది. ఆధార్ లింక్ ద్వారా లబ్ధిదారుల గుర్తింపు సులభతరం అవుతుంది.
ఆధార్-బ్యాంకు ఖాతా లింక్:
సమీప బ్యాంకు శాఖను సందర్శించి, ఆధార్ కార్డు మరియు బ్యాంకు పాస్బుక్తో లింక్ చేయించుకోవచ్చు.
ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే, బ్యాంకు వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆధార్ను లింక్ చేయవచ్చు.
ఎన్పీసీఐ లింక్:
బ్యాంకు శాఖలో ఎన్పీసీఐ మ్యాపింగ్ ఫారమ్ను Thalliki Vandanam పూర్తి చేయాలి.
ఆధార్ నంబర్తో ఎన్పీసీఐ లింక్ చేయడానికి బ్యాంకు సిబ్బంది సహాయం అందిస్తారు.