టన్నెల్ ప్రమాద ఘటనపై BRS నేత హరీశ్ రావు తీవ్ర విమర్శలు Telangana tunnel collapse చేశారు. 50 రోజులు పూర్తైనా సహాయక చర్యల్లో పురోగతి లేదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చారిత్రాత్మక అప్రతిష్ఠగా మారుతుందని పేర్కొన్నారు. తెలంగాణలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ విషాద ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ఘటన జరిగిన 50 రోజులు పూర్తైనా సహాయక చర్యలు ఎలాంటి పురోగతిని చూపించలేదని, బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
SLBC టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ప్రాణాలు వెలకట్టలేనివని ఆయన పేర్కొన్నారు. హెలికాప్టర్లో వెళ్లిన మంత్రులు ఇచ్చిన డెడ్లైన్లు ఒకటిగా మారడం తప్ప, ఎలాంటి ఫలితాలు కనిపించలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠగా మిగిలిపోతుంది,” అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చురుకుగా స్పందించి మృతదేహాలను వెలికితీయాలని, Telangana tunnel collapse బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.