ఉపాధి హామీ పనులలో జరుగుతున్న అక్రమాలపై వీడియో విడుదల చేసి Andhra Pradesh మహిళ ఆత్మహత్య చేసుకుందని దానిని కూడా స్థానిక టీడీపీ నేతల అపహాస్యం చేశారని నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉపాధిహామీ పనులకు వెళ్లిన మహిళ చావును కూడా స్థానిక టీడీపీ నేతలు అపహాస్యం చేశారని నందిగామ మాజీ ఎమ్మల్యే మొండితోక జగన్మోహన్రావు తీవ్రంగా దుయ్యబట్టారు. చనిపోయిన మహిళ అన్ని విషయాలు చెప్పి మరి వీడియో విడుదల చేసిందని అన్నారు. కానీ స్థానిక నేతలు, పోలీసులు కుమ్మక్యై ఆమె చావును తప్పుతోవ పట్టించారని తెలిపారు. దీనిపై నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళ మరణంపై అనేక విమర్శలు చేశారు.
ఉపాధి హామీ పనుల కోసం వెళ్లిన మహిళను ఫీల్డ్ అసిస్టెంట్ తీవ్రంగా దూషించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఆ వీడియో చూస్తే ఎవరికైనా తెలుస్తుందన్నారు. ఆ మహిళ ఉపాధి హామీలో జరుగుతున్న అక్రమాలను వీడియో ద్వారా బయటపెట్టారని తెలిపారు. ఆమె చదువుకున్న వ్యక్తి అని, తెలివైన మహిళ అని అన్నారు. తన చావుకు కారణం ఎవరో స్పష్టంగా చెప్పి మరి మరణించిందని అన్నారు.
ఉపాధి హామీలో అక్రమాలు:
తెలుగుదేశం పార్టీకి చెందిన వీరాభిమాని అయిన ఆమె, ఉపాధి హామీ పనులలో జరుగుతున్న అక్రమాలపై వీడియో విడుదల చేసిందని అన్నారు. తన ఆవేదన మొత్తం కూడా వీడియో ద్వారా వ్యక్తం చేశారని తెలిపారు. కూటమి పాలనలో వారి సొంత పార్టీ అభిమానుల దుస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
మహిళ మరణాన్ని అపహాస్యం చేశారు
మహిళ మరణాన్నిఅనుమానాస్పద మరణంగా, కడుపునొప్పి మరణంగా పోలీసులు నమోదు చేయడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ, “గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో కోటిన్నర తక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తున్నారు” అని విమర్శించారు.
మరణానికి కారణం:
ఆమె మరణానికి సొంత పార్టీ నాయకులే కారణమని, మహిళల సమస్యలు Andhra Pradesh పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మొండితోక ఆగ్రహం వ్యక్తం చేశారు.