బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ప్రజలకు సమాధానంTelangana Politics చెప్పాల్సిన అవసరం ఉందని, “దెయ్యాల రాష్ట్ర సమితి”గా మారిపోయిన బీఆర్ఎస్ను తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రజాపాలన – ప్రగతిబాట సభలో రేవంత్ విమర్శలు
యాదాద్రి భువనగరిలో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతిబాట” బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కవితలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఆ ఇంటి బిడ్డ (కవిత) చెబుతోంది… కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని. అయితే ఆ దెయ్యాల నాయకుడు అయిన కేసీఆర్ మాత్రం స్పందించటం లేదు” అని ఎద్దేవా చేశారు.
“బీఆర్ఎస్ కాదు – డీఆర్ఎస్”
బీఆర్ఎస్ అనేది ఇక **భారత రాష్ట్ర సమితి కాదు… దెయ్యాల రాష్ట్ర సమితి (DRS)**గా మారిందన్నారు. “పదేళ్లు దోచుకున్న రాబందులు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఒక్క నోటీసుతోనే భయపడిపోతున్నారు” అంటూ చురకలు అంటించారు.
కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మౌనం
కవిత చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు స్పందించలేకపోతున్నారని, కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి కూడా రాకపోవడం గమనార్హమన్నారు. బీఆర్ఎస్ అధినేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ స్పీచ్ హైలెట్
రెవంత్ తన ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బిజీగా ఉన్నప్పటికీ, బీఆర్ఎస్పై సమయానుకూలంగా బలమైన విమర్శలు Telangana Politics చేయడమే ఈ సభ స్పీచ్ హైలెట్గా నిలిచింది.