- సీఎం సభ విజయవంతంలో కీలక పాత్ర
- సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పనులు
- కలెక్టర్ లక్ష్మీశ నుంచి ప్రశంసలు
నందిగామ న్యూస్ : ఎన్టీఆర్ జిల్లా నందిగామ Nandigama News ముప్పాళ్ళలో జరిగిన సీఎం చంద్రబాబు సభ విజయవంతం అయింది. ఇందులో శానిటేషన్ విభాగం ప్రత్యేక కృషి చేసి వేల మంది వచ్చిన సభకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిశుభ్రంగా ఉండేలా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నందిగామ మున్సిపల్ కమిషనర్ ఈవీ రమణబాబు కృషి చేశారు. ఎప్పటికప్పుడు శానిటేషన్ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ సీఎం వేదిక ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉండేలా చేశారు. ప్రజా వేదిక వద్ద, కార్యకర్తల మీటింగ్ ప్రదేశంలో ఎంతో పరిశుభ్రంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ఆర్డీవో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సీఎం సభ జరిగే ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నానని కమిషనర్ తెలిపారు. సీఎం పర్యటన ప్రాంతంలో శానిటరీ వర్క్ ను దగ్గరుండి పర్యవేక్షించారు. నందిగామ నుంచి సిబ్బందిని ముప్పాళ్లకు తీసుకెళ్లి సీఎం పర్యటన విజయవంతం అయ్యేలా కృషి చేశారు. మున్సిపల్ సిబ్బందితో పాటు సభా ప్రాంగణం అంతా కలియదిరుగుతూ సిబ్బందికి సూచనలు ఇస్తూ అవిశ్రాంతంగా పని చేశారు. ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సఫలం అయిన మున్సిపల్ తీరును పలువురు అధికారులు అభినందించారు. కలెక్టర్ లక్ష్మీ శ ఇచ్చిన విధులను విజయవంతంగా నిర్వహించిన కమిషనర్ ఈవీ రమణ బాబు. ముఖ్యంగా సీఎం పర్యటన వద్ద గ్రీన్ రూమ్ ఇంచార్జ్ శానిటరీ ఇంచార్జిగా ఆయన విధులు నిర్వహించారు. మార్గదర్శకులను వేదిక వద్దకు తీసుకురావడం వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో కమిషనర్ ఈవీ రమణబాబు కీలకపాత్ర వహించారు. దీంతో Nandigama News ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం పర్యటన, సభ విజయవంతంగా జరిగింది.
