పహల్గాం దాడి తరువాత పీఓకేలో ఉద్రిక్తతలు. స్థానికులకు రెండు నెలల India Pakistan tensions అవసరాలకి సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని సూచించిన ప్రభుత్వం.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి. వాస్తవాధీన రేఖకు సమీపంలోని 13 నియోజకవర్గాల్లోని ప్రజలు రెండు నెలల అవసరాలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని పీఓకే అధికార యంత్రాంగం హెచ్చరించింది.
పీఓకే అసెంబ్లీలో ప్రధానమంత్రి చౌధరీ అన్వర్ ఉల్ హక్ మాట్లాడుతూ, ఁపరిస్థితులు అనిశ్చితంగా మారుతున్న నేపథ్యంలో, ఎమర్జెన్సీ అవసరాల నిమిత్తం రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేశాం అని తెలిపారు. ఈ నిధిని ఆహారం, ఔషధాలు, ఇతర అవసరాల సరఫరా కోసం వినియోగించనున్నారు.
పాకిస్థాన్పై భారత్ కఠినంగా..?
భారత్లో రాజకీయ నాయకులు, విదేశీ భారతీయులు పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవలి కాలంలో బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ మాట్లాడుతూ, పీఓకేను తిరిగి పొందడమే కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం అన్నారు. India Pakistan tensions భారత్ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్థూలంగా చూస్తే
పీఓకేలో ప్రజలకు ఆహారం నిల్వ సూచన
రూ.100 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్
భారత్ పీఓకేపై చర్యలకు అవకాశం?
పహల్గాం దాడి తరువాత పరిస్థితులు తీవ్రతరంగా మారే సూచనలు
ఈ పరిణామాలపై భారత్ వేదిక తీసుకునే విధానంపై దేశం మొత్తం దృష్టి సారించింది.