TS News : గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్

TS LANDS

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ ధాఖలైంది, ఆ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ తెలంగాణ TS News హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది.
హైదరాబాద్ హెచ్‌సీయూ భూముల అంశం ప్రస్తుతం రాజకీయ టర్న్ తీసుకుంది. ఈ భూములు ప్రభుత్వా నివేనని టీజీఐఐసీ సోమ వారం ప్రకటన విడుదల చేసింది. హెచ్‌సీయూలో సర్వే నిర్వహించలేదని ఆ సంస్థ రిజిస్ట్రార్ ప్రకటించారు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఈ 400 ఎకరాలను 2003లో అప్పటి ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించింది. అయితే ఈ భూమిపై న్యాయపోరాటం చేసి ఈ భూమిని స్వాధీనం చేసు కున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.
అయితే ఈ భూమితో హెచ్‌సీయూకు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రభుత్వం చెబుతోంది. ఈ భూమిని విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. TS News హెచ్ సీ యూలోని విద్యార్ధి సంఘాలు కూడా ఈ భూ మల విక్రయాన్న నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

Leave a Comment