సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ Sindhu Waters నిర్ణయంపై AIMIM అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. భారత్లో ఆ నీటిని ఎక్కడ నిల్వ చేస్తారో కేంద్రం తక్షణం వెల్లడించాలన్నారు. “పాకిస్తాన్కు వెళ్లకుండా ఆ నీరు ఇప్పుడు ఎక్కడ ఉంచుతారు?” అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.
ఇక ఇటీవల జరిగిన జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిపై స్పందించిన ఒవైసీ, బైసరన్ మైదానంలో CRPF జవాన్లను ముందుగానే మోహరించకపోవడాన్ని తప్పుపట్టారు. ఘటన జరిగిన తర్వాత సాయుధ దళాలు ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారని విమర్శించారు.
ఉగ్రవాదులు మతాన్ని అడిగి మరీ హత్యలు చేశారని, ఇవి తీవ్ర మతతత్వానికి సంబంధించిన సంఘటనలేనని చెప్పారు. ఇంటెలిజెన్స్ Sindhu Waters విఫలత వల్లే ఈ దాడి చోటు చేసుకుందని గతంలో చెప్పిన మాటల్ని పునరుద్ఘాటించారు.