New Toll System India టోల్ కొత్త‌ నిబంధ‌న‌లు ఇవి తెలుసా

GPS vs GNSS Toll India

జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ విధానం మే 1 నుంచి అమల్లోకి. వాణిజ్య వాహనాలపై తొలుత New Toll System India ప్రయోగం, 2027 నుంచి వ్యక్తిగత వాహనాలకు విస్తరణ.

దేశవ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద ప్రయాణదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (GNSS) ఆధారంగా, ఇకపై ప్రయాణించిన దూరాన్నిబట్టి టోల్ వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త విధానం మే 1, 2025 నుంచి అమల్లోకి రానుంది.

ముందుగా వాణిజ్య వాహనాలకు, 2027 నుండి ప్రైవేట్ వాహనాలకు

ఈ విధానం తొలుత వాణిజ్య వాహనాలపై ప్రయోగాత్మకంగా ప్రారంభమవుతుంది. 2027 నాటికి అన్ని వ్యక్తిగత వాహనాలకు GNSS టోల్ విధానం అమలు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అటుపై టోల్ గేట్ల అవసరం పూర్తిగా తొలగే అవకాశం ఉంది.

GNSS ఏమిటి? GPSకి తేడా ఏమిటి?

GNSS అంటే Global Navigation Satellite System. ఇది గ్లోనాస్ (రష్యా), గెలీలియో (యూరప్), బైదు (చైనా), గగన్, నావిక్ (భారత్) లాంటి అనేక దేశాల శాటిలైట్లతో పనిచేస్తుంది. ఇది సాధారణ GPS కంటే ఎక్కువ ఖచ్చితమైన లొకేషన్, ట్రాకింగ్ వ్యవస్థను అందిస్తుంది.

ప్రయోజనాలు

  • ప్రయాణించిన కిలోమీటర్ల మేరకు మాత్రమే చార్జీ

  • టోల్ గేట్ల వద్ద గడపాల్సిన సమయం తగ్గుతుంది

  • వాహనాల ట్రాకింగ్ మరింత ఖచ్చితంగా జరుగుతుంది

  • భవిష్యత్తులో టోల్ గేట్లు పూర్తిగా తొలగే అవకాశమూ ఉంది

ఈ విధానం అమలుతో వాహనదారులకు భారం తగ్గి, సమయం ఆదా New Toll System India అవుతుందని కేంద్రం భావిస్తోంది.

Leave a Comment