మ‌ద్యం ప్రియుల‌కు ఇక పండ‌గే : Telangana liquor news

Telangana liquor news

తెలంగాణలో మద్యం వినియోగదారుల కోసం త్వరలోనే కొత్త రూపంలో Telangana liquor news మద్యం అందుబాటులోకి రానుంది. ప్రముఖ మద్యం బ్రాండ్ McDowell’s, టెట్రా ప్యాక్‌లలో మద్యం విక్రయించాలని నిర్ణయించింది. ఈ ప్యాకెట్లు 60ml, 90ml, 180ml పరిమాణాల్లో ఉంటాయి. ఫ్రూట్ జ్యూస్‌ల తరహాలో ఉండే ఈ ప్యాకెట్లు ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో విజయవంతంగా అందుబాటులోకి వచ్చాయి.

తెలంగాణలో తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ టెట్రా ప్యాక్స్ అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రస్తుతం చీప్ లిక్కర్ క్వార్టర్ ధర సుమారుగా రూ.120గా ఉండగా, టెట్రా ప్యాక్‌ల ధర రూ.100 వరకూ ఉండే అవకాశముందని సమాచారం.

McDowell’s సంస్థ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో రెండు సార్లు చర్చలు జరిపింది. టెట్రా ప్యాక్‌ల వల్ల వ్యయాన్ని తగ్గించడంతోపాటు ప్రభుత్వ ఆదాయం పెరగనుందన్న అంచనాలున్నాయి. కర్ణాటకలో McDowell’s అమ్మకాలలో 90% టెట్రా ప్యాక్‌లదే కావడం ప్రత్యేకత.

ఈ పద్ధతి వల్ల వినియోగదారులకు తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో సీసాల తయారీ ఖర్చు తగ్గుతుంది. Telangana liquor news దీనితోపాటు మద్యం భద్రత, డెలివరీ తక్కువ ఖర్చుతో నిర్వహించగలిగే వీలూ ఏర్పడుతుంది.

Leave a Comment