మహబూబ్ నగర్: మానవ సంబంధాలు అర్థం కోల్పోతున్న ఈ యుగంలో, ఓ తండ్రి mahabubnagar news మృతదేహానికి తలకొరివి పెట్టేందుకు కొడుకు నిరాకరించాడన్న వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. మహబూబ్నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీకి చెందిన మాణిక్య రావు ఇటీవల మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
మరణానంతరం తలకొరివి పెట్టేందుకు పెద్ద కుమారుడిని కుటుంబ సభ్యులు అభ్యర్థించగా, అతను కోటి రూపాయల విలువ చేసే ఇల్లు, పది తులాల బంగారం తనకు రాసిచ్చినపుడే తండ్రికి తలకొరివి పెడతానని గొడవపడ్డాడు. దీంతో బంధువులు, పొరుగువారు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఈ పరిస్థితుల్లో, కుటుంబానికి అండగా నిలిచిన మాణిక్య రావు చిన్న కూతురు తండ్రికి తలకొరివి పెట్టి, అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొచ్చింది. ఆమెకు తండ్రిపై తనకున్న ప్రేమను చూపించి అందరికీ ఆదర్శంగా నిలిచింది.
ఈ ఘటనను చూసిన స్థానికులు, “మనసు ఉంటేనే సంబంధాలు ఉంటాయి.. ఆస్తి కోసం బంధాలు మరిచిపోతున్న ఈ కాలంలో ఆ చిన్న కూతురు మానవత్వాన్ని చూపింది” mahabubnagar news అంటూ స్తానికులు ప్రశంసిస్తున్నారు.