Medigadda barrage report : ఎన్‌డీఎస్ఏ నివేదికపై ఎల్&టీ సంచలన లేఖ – మేడిగడ్డపై మరో వివాదం

medigadda

మేడిగడ్డ బ్యారేజ్‌పై ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ప్రశ్నించిన Medigadda barrage report ఎల్&టీ – పరీక్షలు చేయకుండా నివేదిక ఎలా అని లేఖలో సంచలన వ్యాఖ్యలు.

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలపై ఎన్‌డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) రూపొందించిన నివేదికపై ఎల్&టీ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్‌డీఎస్ఏకి ఓ సంచలనాత్మక లేఖ రాసిన ఎల్&టీ, పరీక్షలు చేయకుండా నివేదిక ఎలా ఇచ్చారంటూ కఠినంగా ప్రశ్నించింది.

ఎన్‌డీఎస్ఏ నివేదికలోని ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో మేడిగడ్డ వైఫల్యం తెలుసుకోవాలంటే తగిన సాంకేతిక పరీక్షలు అవసరమని పేర్కొనడం, అయితే అదే సమయంలో గ్రౌటింగ్ కారణంగా పరీక్షలు జరగలేదని పేర్కొనడంపై ఎల్&టీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

“పరీక్షలు జరపకుండా బ్యారేజ్ పరిస్థితిని ఎలా అంచనా వేస్తారు?” అనే ప్రశ్నను లేఖలో స్పష్టంగా రాసింది. నివేదికలోని పేజీ 283లో తమ క్వాలిటీ కంట్రోల్ నివేదికను పొందుపరిచినట్లు పేర్కొంటూనే, ఇతర చోట్ల క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని పేర్కొనడం ఎంతవరకు సమంజసమో కూడా లేఖలో ప్రస్తావించింది.

బ్యారేజ్ పునరుద్ధరణ కోసం తాము గతంలోనే ఎన్‌డీఎస్ఏతో పాటు నీటిపారుదల శాఖకు కూడా లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ, పరీక్షలు లేకుండానే వైఫల్యం అని నిర్దారించడాన్ని తప్పుపడింది. దీనితో మేడిగడ్డ అంశం కొత్త మలుపు తిరిగింది.

ఈ వివాదం ఇప్పుడు ప్రాజెక్ట్ రాజకీయాలు, సాంకేతిక విశ్లేషణల మధ్య Medigadda barrage report నడుస్తూ, ప్రజల్లోను ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Leave a Comment