Sri Lakshmi Perantala Ammavari : ఎన్టీఆర్ జిల్లాలో శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారి తిరునాళ్లు ఘనంగా ముగిసాయి

Sri Lakshmi Perantala Ammavari

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ (లింగాలపాడు) పరిధిలోని శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారి Sri Lakshmi Perantala Ammavari  ఆలయంలో ఐదు రోజులుగా వైభ‌వంగా నిర్వహించిన తిరునాళ్లు శనివారం ఘనంగా ముగిశాయి.

లింగాలపాడు గ్రామంలోని శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి ఆలంకారప్రాయ దర్శనాన్ని అందించారు. శనివారం రాత్రి ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్థానిక నేతలతో కలిసి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ మరియు అధికారులు దేవినేని ఉమాను శాలువాతో సత్కరించారు. అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ తిరునాళ్ల సందర్భంగా జిల్లా పరిషత్ ఆవరణలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో పశు బల ప్రదర్శన (బండ లాగుడు) పోటీలు ఐదు రోజులుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. దేవినేని ఉమా ఈ పోటీలు Sri Lakshmi Perantala Ammavari సందర్శించి విజేతలకు బహుమతులు అందజేశారు. తిరునాళ్ల వేడుకలు గ్రామ ప్రజల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి.

Leave a Comment