గుడివాడ: మాజీ మంత్రి, వైసీపీ నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని kodali Nani ఆరోగ్యం విషమించడంతో ముంబైకి తరలించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు ముంబైకి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సత్ఫలితాలను చూపిస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు.
కొడాలి నాని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గడిచిన కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. ప్రస్తూతం ఆయన వైద్యం చేయించుకుంటున్నారు. వైద్యులు ఆయనకు పూర్తిస్థాయి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన వైద్యం కోసం ముంబైలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరారు. ఈ విషయాన్ని కొడాలి నాని కుటుంబ సభ్యులు తెలిపారు. కొడాలి నానికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రస్తూత సమాచారం. వైద్యులు, నిపుణులు అతని ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు, వైద్య నిపుణులు త్వరలోనే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దని త్వరలోనే కొడాలి నాని kodali nani health ఆరోగ్యంగా తిరిగి వస్తారని కుటుంబ సభ్యలు తెలిపారు.
ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆయన అనుచరులు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. కొడాలి నానికి ఏమైంది. ఆరోగ్యం ఎలా ఉంది. ఎప్పడు కోలుకుంటారు వంటి వార్తలు నిత్యం వెలువడుతున్న తరుణంలో కుటుంబ సభ్యుల నుంచి ఖచ్చితమైన సమాచారం రావాల్సి ఉంది. అయితే ఎలాంటి ఫేక్ వార్తలు నమ్మవద్దని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తాము వెల్లడిస్తామని వారు తెలిపారు. కొడాలి నాని వెంట ఆయన కుటుంబ సభ్యులు ఉండి నిత్యం పరిశీలిస్తున్నారు.
కొడాలి నాని ఆరోగ్య బులెటెన్ రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే అప్డెట్ ఇస్తాము.