Telangana Politics : తెలంగాణపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Telangana development (1)

తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినప్పటికీ Telangana Politics ప్రస్తుతం వెనక్కి వెళ్తోందని ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం చదవండి.

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన తమ సాధనను ఇప్పుడు పాతాళానికి తీసుకెళ్లారని మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ 25 ఏళ్ల జయంతి సభలో ఆయన మాట్లాడారు.

“ఇయ్యాల చాలా బాధ కలుగుతున్నది. తెలంగాణ 14, 15వ స్థానాల్లో పడిపోయింది. ఇంకా ముందుకు పోవాల్సిన రాష్ట్రం వెనక్కి వెళ్తుంది. దీనికి బాధ్యులు ఎవరు? ప్రజలు ఈ దుర్మార్గులను నిలదీయాలి,” అని కేసీఆర్ ఉద్ఘాటించారు.

పేదల ఇండ్లపై దాడులు

నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో చెరువుల్లో బురద తీసేందుకు బుల్డోజర్లను వాడామని, అదే ఇప్పుడు పేదల ఇండ్లను కూల్చే పనికి వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌, వరంగల్ సహా అనేక ప్రాంతాల్లో పేదలకు ఇంటి పట్టాలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
“బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు మద్దతు ఇచ్చాం. ఇప్పుడు హైడ్రాలిక్ క్రేన్లు, బుల్డోజర్లతో వారి గుడిసెలను నేలమట్టం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ మౌనంగా ఉండాలా? ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది,” అన్నారు.

ప్రజలకు మేల్కొలుపు పిలుపు

కేసీఆర్ తన ప్రసంగంలో ప్రజలను మేల్కొలిపారు. తెలంగాణ గర్వాన్ని Telangana Politics తిరిగి తీసుకురావాలంటే ఇప్పుడు ప్రజల చైతన్యం అవసరమని అన్నారు. 25 ఏళ్లుగా బీఆర్‌ఎస్ చేసిన సేవలు గుర్తు చేశారు.

Telangana development (2)
Telangana development (2)

Leave a Comment