పూరీలో జగన్నాథుని రథయాత్రకు ఘనంగా ప్రారంభం. Jagannath Rath Yatra 2025 లక్షలాది భక్తుల మధ్య ముగ్గురు దేవతలు రథాలపై విహారయాత్రకు. భారీ భద్రతా ఏర్పాట్లు.
ఒడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణం జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభానికి సిద్ధమైంది. భక్తుల ఉత్సాహం మధ్య నందిఘోష్, తాళధ్వజ్, దర్పదళన్ అనే మూడు రథాలను భక్తులు ముందుగా తీర్థంగా అలంకరించారు.
జగన్నాథుడు – నందిఘోష్ రథం
బలభద్రుడు – తాళధ్వజ రథం
సుభద్ర దేవి – దర్పదళన్ రథం
ఈ ముగ్గురు దేవతలు గుండిచా దేవి ఆలయం వైపు సాగించనున్న ఈ మహా యాత్రను వీక్షించేందుకు 12 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
భద్రతకు హైఅలర్ట్
అధికారులు ఈసారి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు:
10,000 మంది పోలీసులు మోహరింపు
275 AI ఆధారిత కెమెరాలు
డ్రోన్ల ద్వారా నిఘా
అత్యవసర వైద్య బృందాలు, మొబైల్ హెల్త్ యూనిట్లు
ప్రత్యేక రవాణా సౌకర్యాలు
రథయాత్ర ప్రత్యేకతలు:
యాత్ర ప్రారంభానికి ముందు రాజగురు చేత మంత్రోచ్ఛారణ
రథాల వద్ద పూలతో, చందనంతో అలంకరణ
చక్రధరుడి రథాన్ని మానవులే Jagannath Rath Yatra 2025 లాగడం – భక్తులకే ఈ అవకాశము
గుండిచా ఆలయానికి ప్రయాణం – ఆరు రోజులపాటు ఉత్సవాలు