Jagan Comments on Mahanadu : మహానాడుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

JaganMohanReddy

తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని వైఎస్‌ Jagan Comments on Mahanadu జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ‘‘మహానాడు అంటే పెద్ద డ్రామా, చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులిస్తున్నాడు’’ అని ఎద్దేవా చేశారు. పార్టీ అధినేతగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సమావేశమైన జగన్, స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు.

జగన్ మాట్లాడుతూ, “హీరోయిజం అంటే హామీలను నెరవేర్చడం, కానీ చంద్రబాబుకు అది సాధ్యం కాదు” అన్నారు. కడపలో మహానాడు నిర్వహించడం తగిన పని కాదని, తనపై చేసిన విమర్శలు సరైనవికావని పేర్కొన్నారు.

సూపర్ సిక్స్, హామీలు – విమర్శల వర్షం:
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత “సూపర్ సిక్స్”, “సూపర్ సెవన్” పథకాల గురించి ఎక్కడా లేనని, ప్రజలకు కనీస మద్దతు ధర, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి లాంటి సంక్షేమ పథకాలూ అందడంలేదని అన్నారు. “143 హామీలను పక్కన పెట్టారు, బస్సు ప్రయాణం కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు” అంటూ జగన్ మండిపడ్డారు.

విద్య, ఆరోగ్య రంగాలపై తీవ్ర విమర్శలు:
సీబీఎస్ఈ, టోఫెల్, నాడు-నేడు వంటి విద్యా పథకాలు ఆగిపోయాయని, ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి దారుణంగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని ఆరోపించారు.

రైతుల కష్టాలు – కేంద్రంపై ధ్వజం:
ధాన్యానికి కనీస మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు దళారుల చేతుల్లో పడిపోయారని, ఎన్డీఏ పాలన వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా Jagan Comments on Mahanadu మారిందని జగన్ వ్యాఖ్యానించారు. ‘‘మేము రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ముప్పై నెలల్లో ప్రజలకు అందించాం. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు?’’ అని నిలదీశారు.

Leave a Comment