India Mango Export : భారత్‌కు అమెరికా మరో షాక్

USA Mango Ban, Trade Relations

భారత్-అమెరికా సంబంధాలు క్రమంగా ప్రతికూలంగా మారుతున్నాయి. పాకిస్తాన్‌పై India Mango Export భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను నిలిపేయడం కోసం అమెరికా ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చిన తర్వాత, తాజాగా మరో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది.

అమెరికా ఎయిర్‌పోర్టుల్లోకి భారత్ నుంచి దిగుమతి చేసిన 15 మామిడి పండ్ల షిప్‌మెంట్‌లను అధికారులు నిలిపివేశారు. సరైన పత్రాలు లేవన్న కారణంతో ఈ పండ్లను దేశంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. వీటి విలువ సుమారు 5 లక్షల అమెరికన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో 4 కోట్ల రూపాయలు).

ధ్వంసం చేయాల్సిన దుస్థితి
మామిడి పండ్లను తిరిగి భారత్‌కు రవాణా చేయడం చాలా ఖరీదైన ప్రక్రియ కావడంతో, అక్కడే ధ్వంసం చేయాల్సిన పరిస్థితి రైతులకు ఎదురైంది. లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా పలు ఎయిర్‌పోర్టుల్లో మామిడి పండ్లను ఒకేసారి అడ్డుకోవడం వెనుక ప్రభుత్వ ఆదేశాలే కారణమై ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

రైతులకు గట్టి ఎదురుదెబ్బ
ఇప్పటి వరకు మామిడి పండ్ల ఎగుమతిలో భారత్‌కు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న అమెరికా తీసుకున్న నిర్ణయం రైతులకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. మామిడి పండ్ల ఎగుమతికి సంబంధించి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఇరు దేశాల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు
ఇటీవల కాలంలో భారత్-అమెరికా మధ్య కొన్ని రాజకీయ, వాణిజ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేయడం, సుంకాల మినహాయింపుపై అమెరికా ఏకపక్ష ప్రకటనలు వంటి అంశాలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి.

భారత ప్రభుత్వ స్పందన
భారత రైతులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వమే ముందుకు రావాలని విజ్ఞాపనలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం ఇరు దేశాల్లో చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై త్వరలో స్పందించనున్నట్లు సమాచారం.

ఈ పరిణామం మామిడి పండ్ల ఎగుమతిదారులకు ఆందోళన కలిగించింది. India Mango Export భారత్-అమెరికా సంబంధాలు ఇలా మరింతగా ప్రతికూలంగా మారితే, వ్యాపార రంగంలో గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది.

Leave a Comment