- వాహనదారుల జేబుకు చిల్లు
పెట్రోల్ రాకుండా తిరుగుతున్న మీటరు
లీటరుకు 8రూపాయల నష్టం
వెలుగులోకి తెచ్చిన నందిగామ టీవీ
పెట్రోల్ బంకుల్లో మోసాలు చాలా చూశాంగాని నందిగామ పరిధిలోని అడవిరావులపాడు Nandigma News పెట్రోల్ బంకులో జరిగే మోసం ఎక్కడా చూసి ఉండరు. ఎందుకంటే పెట్రోల్ రాకుండా రీడింగ్ పెరగటం ఎక్కడైనా చూశారా.. పెట్రోల్ రాకుండా కెవలం గాలి మాత్రమే రావడం ఎక్కడైనా చూశారా.. లేదు కదా అందుకే పెట్రోల్ బంకుల మోసాల్లో అడవిరావులపాడు పెట్రల్ బంక్ మోసం వేరయా అనే విధంగా ఉంది.
లీటరుకు 8రూపాయలు నష్టం
లీటరుకు 8 రూపాలయలు పెట్రోల్ పోయకుండా సంపాదిస్తున్నారు. ఆటోడ్రైవర్ల జేబులకు చిల్లు పెడుతున్నారు. అయితే ఒక వినియోగదారుడు మోసపోయిన విషయం గ్రహించి నందిగామ టీవీని సంప్రదించాడు. అక్కడ జరుగుతున్న మోసాల గురించి అక్కడి వారు ఇచ్చిన సమాచారం గురించి తెలుసుకుని వివరాలు అడిగితెలుసుకున్నారు మా ప్రతినిధి షాబాన్పాషా. అసలు ఏం జరిగిదంటే ఒక ఆటో డ్రైవర్ పెట్రోల్ పోయించుకోవడానికి అడవిరావుల పాడు బంకుకు వెళ్లాడు. పెట్రోల్ పోయించుకున్న తర్వాత ఆ పెట్రోల్లో మోసం జరిగిందని గ్రహించాడు. నందిగామ టీవీ ప్రతినిధికి తెలియజేయగా అక్కడికి వెళ్లి మళ్లీ ప్రయత్నించమని అడిగితే అప్పడు బయటపడింది అసలు కధ, ముందుగా ట్యాంకులో కొద్దిగా పెట్రోల్ వచ్చి ఆ తర్వాత గాలి రావడం మొదలు అయింది. కానీ మీటరు రీడింగ్ తిరుగుతూనే ఉంది. సుమారు ఇలా 8రూపాయల వరకు వచ్చి ఆ తర్వాత పెట్రోల్ రావడం మొదలైంది.

రీడింగ్లో హెచ్చుతగ్గులు
అడవి రావులపాడు నయారా డీజిల్ బంక్ వద్ద డీజిల్ రీడింగ్ హెచ్చుతగ్గులు… మోసాలు విని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకాలం మనం ఇంత మోస పోయామా అంటూ బాధపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అడవి రావులపాడు గ్రామం వద్ద ఉన్న నయారా డీజిల్ బంకు వద్ద డీజిల్ హెచ్చు తగ్గుల తో ఇటు ఆటో డ్రైవర్లు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకాలం దారినపోయేవారు అనుకోవడమే కానీ ఇప్పడు అసలు బండారం బయటపడింది. బంకులో సిబ్బంది మోసాలు చేస్తున్నారా లేక యాజమాన్యం చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అసలు బంకుకు పర్మషన్ ఉందా ఉంటే ఎంత వరకు ఉంది అనేది అధికారులు తనిఖీలు చేసి బయటపెట్టాలి.

బంకు సిబ్బంది బుకాయింపు
హెచ్చుతగ్గుల పై వాహనదారులు ప్రశ్నిస్తే తేడా ఏమీ లేదన్నా అంతా బానే ఉందిలే.. అంటూ లైట్ తీసుకుంటున్నారు. ఇక చేసేది ఏమీలేక హడావుడి ప్రయాణంలో వున్న వాహనదారులు అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఇక డీజిల్ బంకు సిబ్బంది విషయానికి వస్తే డీజిల్ మోటార్ ఆన్ చేయగా డీజిల్ పోయకుండానే 7. 76 రూపాయలు 0.8 తేడా చూపుతున్న వైనం వెలుగుచూసింది. చాలా కాలం నుండి ఇలా జరుగుతుందని మోసపోయామని నయారా బంకు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు. ఈ విషయంపై అడవిరావులపాడు నయారా పెట్రోల్ , డీజిల్ బంక్ పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని Nandigma News వినియోగదారులు కోరుతున్నారు.