వీధికుక్కల దాడితో చిన్నారి హారిక కోమాలోకి వెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. బాధిత child coma case తల్లి ప్రభుత్వం నుంచి సహాయం కోరుతోంది.
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్: మానవతా విలువలు చలించిపోయే సంఘటన ఇది. నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నివసించే సిద్వంతి అనే మహిళ రెండేళ్లుగా తన చిన్న కూతురు హారికను కోమా నుంచి కాపాడేందుకు నిస్సహాయంగా పోరాటం చేస్తోంది.
రెండున్నర ఏళ్ల క్రితం భర్తను కోల్పోయిన సిద్వంతి, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. చిన్న కూతురు హారిక, రెండు సంవత్సరాల క్రితం ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధికుక్కల దాడికి గురైంది. తీవ్రంగా గాయపడిన హారికను నాగార్జునసాగర్ కమల నెహ్రూ ఆసుపత్రిలో చేర్చారు.
కుక్కకాటు నివారణ టీకాలు వేసిన తర్వాత, హారిక తీవ్ర జ్వరానికి గురయ్యింది. ఆ సమయంలో మూడో డోసు టీకా వేయడంతో పరిస్థితి మరింత విషమమైంది. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ నుంచి నిలోఫర్ ఆసుపత్రికి తరలించినా.. హారిక స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లింది.
ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసినా, హారిక పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని సిద్వంతి వాపోతున్నారు. “నా కూతురు పక్కన పడుకుని ఉన్నా అమ్మా అని పిలవలేదు. ప్రభుత్వం స్పందించి వైద్యానికి సహాయపడితే child coma case జీవితాంతం రుణపడి ఉంటాను,” అంటూ ఆమె కన్నీటిపర్యంతమవుతోంది.