బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ దుష్ప్రచారం Chandrababu on BRS చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. సముద్రంలో కలిసే నీటిని వాడితే తప్పేంటని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన మహానాడు వేదికపై మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బనకచర్ల ప్రాజెక్టు వల్ల మేలు మాత్రమే: చంద్రబాబు
కర్నూలు జిల్లా బనకచర్లలో నిర్మించబోయే భారీ నీటి ప్రాజెక్టు గురించి చంద్రబాబు ప్రస్తావిస్తూ, “గోదావరి జలాలను పోలవరం ద్వారా మళ్లించి బనకచర్లలో నిల్వచేసి, రాయలసీమ ప్రజలకు అందించాలన్నది మా సంకల్పం” అని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైందని, కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపిన విషయాన్ని వెల్లడించారు.
అయితే, దీనిపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. “సముద్రంలో కలిసిపోయే నీటిని వాడుకుంటే తప్పా? ప్రజలకు మేలు చేస్తే ఓర్చుకోలేరా?” అని చంద్రబాబు ప్రశ్నించారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు ఆపాలని, తెలంగాణకు నష్టం జరగదని స్పష్టం చేశారు.
రెవంత్, బీఆర్ఎస్ స్పందనలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్రానికి లేఖ రాస్తూ ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కూడా బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశారు. కేటీఆర్ గతంలో “ఏపీ ప్రాజెక్టు కడితే రేవంత్ కళ్లు మూసుకున్నారా?” అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు స్పష్టత
“ఏ ప్రాజెక్టు కడితేనూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మేలు జరగాలి. మా ఉద్దేశం స్వార్థపూరితమైనది కాదు. తెలుగు ప్రజల కోసమే పని చేస్తున్నాం” అని చంద్రబాబు Chandrababu on BRS అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేస్తే రాయలసీమను సస్యశ్యామలంగా మార్చే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.