Chandrababu on Kuppam incident : మహిళను చెట్టుకు కట్టేసి దారుణం సీఎం చంద్రబాబు సిరియస్ యాక్షన్

Chandrababu on Kuppam incident

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో, అప్పు విషయంలో Chandrababu on Kuppam incident ఒక మహిళను చెట్టుకు కట్టేసిన దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఘటన వెలుగులోకి వచ్చాక వెంటనే చిత్తూరు ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు, నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు.

ఎస్పీతో మాట్లాడిన సీఎం – తక్షణం స్పందన
మహిళపై దాడి చేసిన మునికన్నప్ప ఇప్పటికే అరెస్ట్‌లో ఉన్నట్టు ఎస్పీ వివరించగా, సీఎం చంద్రబాబు ఈ రకమైన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ మరియు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

కఠిన చర్యలు తీసుకోవాలని సూచన
“ఇలాంటి సంఘటనలు మానవత్వాన్ని తాకట్టు పెడతాయి. మహిళల రక్షణే ప్రభుత్వ ప్రాధాన్యత” అని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకొని ఇతరులకు బుద్ధి వచ్చేలా చర్యలు తీసుకోవాలి అని స్పష్టం చేశారు.

సామాజిక స్పర్శతో స్పందించిన ప్రభుత్వం
ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో మహిళల భద్రతపై సాధారణ ప్రజానికంలో ఆందోళన పెంచుతున్నాయి. ఈ తరహా ఘటనలపై ప్రభుత్వం సున్నితంగా కాకుండా దృఢంగా స్పందిస్తుందన్న సంకేతం, చంద్రబాబు తాజా Chandrababu on Kuppam incident ఆదేశాల ద్వారా వెల్లడైంది.

Leave a Comment