అయోధ్య శ్రీరామ మందిరానికి తమిళనాడు నుంచి Ayodhya Ram Mandir Threat బెదిరింపు మెయిల్ వచ్చింది. భద్రతను పెంచిన అధికారులు. గతంలో కూడా ఖలీస్థానీ ఉగ్రవాదుల బెదిరింపులు చేశారు.
భారతదేశంలోని ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య శ్రీరామ మందిరానికి మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆదివారం రాత్రి ఆలయ ట్రస్ట్ అధికారిక మెయిల్ ఐడీకి వచ్చిన ఈ బెదిరింపుతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీనికి ప్రతిస్పందనగా ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తమిళనాడులో నుంచి మెయిల్?
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ బెదిరింపు మెయిల్ తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు అధికారులు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తూ, భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేస్తున్నారు. ఇప్పటికీ ట్రస్ట్ గానీ, పోలీసులు గానీ అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
గతంలోనూ పలుమార్లు బెదిరింపులు
ఇది తొలిసారే కాదు. గతంలో కూడా అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఖలీస్థానీ ఉగ్రవాది పన్నూ, మరియు బిహార్కు చెందిన మక్సూద్ అన్సారీ వంటి వ్యక్తులు బాంబు బెదిరింపులు చేశారు.
పన్నూ రామాలయాన్ని పేల్చివేస్తామంటూ హెచ్చరికలతో వార్తల్లోకి వచ్చాడు.
మక్సూద్ అన్సారీ RDX పేలుడు సామగ్రిని ఉపయోగిస్తానని బెదిరించాడు.
విచారణ కొనసాగుతోంది
ఈ తాజా ఘటనపై సీనియర్ పోలీస్ అధికారులు స్పందిస్తూ విచారణ Ayodhya Ram Mandir Threat కొనసాగుతోందని చెప్పారు. మెయిల్ ఇంగ్లీష్ లో వచ్చిందని తెలిపారు. అయితే పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.