ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పారేపల్లి సాయిబాబు నేతృత్వంలో Nandigama News సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 10 మంది నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున మొత్తంగా రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ వితరణను నందిగామ వాస్తవ్యుడు, వాసవీ మార్కెట్ గణపతి ఉత్సవ కమిటీ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్వర్గీయ నందనపాటి ఆదినారాయణ మరియు కృష్ణ కుమారి జ్ఞాపకార్థంగా వారి అల్లుడు మహంకాళి మస్తాన్ రావు, కుమార్తె భాగ్యలక్ష్మీ మరియు మనవళ్ళ సౌజన్యంతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మహంకాళి వెంకన్న గురుస్వామి – అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు, 36 సంవత్సరాలుగా స్వామి మాల ధరించి సేవా మార్గంలో నిరంతరంగా ఉన్న ఆయన చేతులమీదుగా వితరణ పంపిణీ చేశారు. గురుస్వామి గత 15 సంవత్సరాలుగా వేసవికాలంలో చలివేంద్రం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవలో కొనసాగుతున్నారు. కార్యక్రమం అనంతరం, ఆర్యవైశ్య సంఘం తరఫున సాయిబాబు గురుస్వామిని శాలువాతో Nandigama News ఘనంగా సత్కరించారు.