Andhra Pradesh services : పీ సేవా పోర్టల్ పునరుద్ధరణ

AP Seva Portal

నాలుగు రోజుల విరామం అనంతరం ఏపీ సేవా పోర్టల్ Andhra Pradesh services  సేవలు పునరుద్ధరణ. ఆదాయ, మ్యూటేషన్, రేషన్ తదితర పత్రాల సేవలు అందుబాటులోకి వచ్చాయి.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్న ఏపీ సేవా పోర్టల్ సేవలు తిరిగి పునరుద్ధరయ్యాయి. గత నాలుగు రోజులుగా ఈ పోర్టల్‌ సేవలు నిలిపివేయబడిన విషయం తెలిసిందే. జీఎస్.డబ్ల్యూఎస్ (GSWS) శాఖ ఆధ్వర్యంలో పోర్టల్‌ను అప్డేట్ చేయడం కోసం ఈ విరామాన్ని అమలు చేశారు.

ధ్రువీకరణ పత్రాల సేవలు అందుబాటులోకి..
బుధవారం ఉదయం నుంచి సేవలు మళ్లీ ప్రారంభించగా, పౌరులకు అత్యవసరమైన పలు ధ్రువీకరణ పత్రాల జారీ తిరిగి సాధ్యమైంది. ముఖ్యంగా ఆదాయ ధ్రువీకరణ పత్రం, సమగ్ర ధ్రువీకరణ పత్రం, భూమి మ్యూటేషన్లు, రేషన్ కార్డులు, బియ్యం కార్డులు, ఇళ్ల పట్టాలు, స్థలపట్టాలు, వృద్ధాప్య ధ్రువీకరణ పత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రాలు వంటి సేవలు పూర్తిగా పునరుద్ధరించబడ్డాయి.

ఇతర సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి:
రెవెన్యూ వాటర్ ట్యాక్స్, పట్టణ పరిపాలన సేవలు, మత్స్యశాఖ అనుబంధ సేవలు కూడా వినియోగదారుల కోసం మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామ సచివాలయాల్లో ప్రజలు తిరిగి సహజంగానే తమ పనులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈ పోర్టల్ సేవలు నిలిచిన సమయంలో పౌరులకు పలు Andhra Pradesh services తలెత్తినా, ఇప్పుడు సేవలు యథాతథంగా కొనసాగడం ప్రజలకు ఉపశమనం కలిగించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment