ఏపీలో రేషన్‌కార్డుదారులకు అలర్ట్: ఇది చేయకపోతే రేషన్ క‌ట్‌ : AP Ration Card eKYC Update 2025

AP Ration Card eKYC Update 2025

ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 2025: రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగి ఉన్న లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈ నెల (ఏప్రిల్) 30లోగా రేషన్ కార్డుదారులు AP Ration Card eKYC Update 2025 తప్పనిసరిగా eKYC ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. లేకపోతే వారి రేషన్ అందుబాటులో ఉండకపోవచ్చు.

ఎలా తెలుసుకోవాలి మీ eKYC స్టేటస్?

  1. పోస్ మెషిన్ ద్వారా రేషన్ డీలర్ లేదా మొబైల్ రేషన్ వాహనాల వద్ద మీ కార్డు స్కాన్ చేయించండి.

  2. ఎర్ర రంగు బాక్స్ (Red Box): మీ eKYC పెండింగ్‌లో ఉంది. వెంటనే చేయాలి.

  3. ఆకుపచ్చ రంగు బాక్స్ (Green Box): మీరు eKYC ఇప్పటికే పూర్తి చేశారు.

మీ పేరు EPDS సైట్‌లో ఎలా చెక్ చేయాలి?

  1. గూగుల్‌లో epds1 అని టైప్ చేసి సెర్చ్ చేయండి.

  2. Department of Consumer Affairs, Food & Civil Supplies – AP’ అనే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి.

  3. RICE CARD SEARCH‘ లేదా ‘EPDS APPLICATION SEARCH‘ పై క్లిక్ చేసి, మీ రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేయండి.

  4. మీ పేరెదురుగా SUCCESS లేదా S అనే ముద్ర ఉంటే – eKYC పూర్తయింది.

ఎవరికి ఈకేవైసీ తప్పనిసరి కాదు?

  • 5 ఏళ్లు లోపు చిన్నారులు

  • 80 ఏళ్లు పైబడిన వృద్ధులు

డెడ్‌లైన్: ఏప్రిల్ 30, 2025

ఈ తేదీ వరకే అవకాశం ఉంది. తరువాత మీ పేరు రేషన్ పంపిణీ లిస్టులో ఉండకపోవచ్చు. AP Ration Card eKYC Update 2025 కావున వెంటనే మీ రేషన్ డీలర్‌ను సంప్రదించి, వేలిముద్రతో eKYC పూర్తి చేయండి.

Leave a Comment