AP Ration Anywhere : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ బాధలు తప్పినట్లే..

ration card

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా AP Ration Anywhere రేషన్ కార్డుదారులు ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందవచ్చు అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సాంకేతిక మార్పులతో రేషన్ పంపిణీ విధానం మరింత పారదర్శకంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

మంత్రి వ్యాఖ్యల ప్రకారం, దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఇక ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ రేషన్ సరుకులు పంపిణీ చేయబడతాయని, ఈ విషయాన్ని ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించినట్టు గుర్తు చేశారు.

పారదర్శక పంపిణీ – ప్రజల భరోసా
రేషన్ విధానం మరింత ప్రభావవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా కొత్త విధానం ద్వారా ఎక్కడైనా సరుకులు పొందే అవకాశాన్ని కల్పించటం ద్వారా కార్డుదారులకు మరింత సౌకర్యం కలుగుతుందని అన్నారు.

Leave a Comment