నందిగామ న్యూస్ / నందిగామ రిపోర్టర్ : అర్థరాత్రి గ్రామీణ బ్యాంకు Andhra Pradesh Grameena Bank ఖాతాదారులకు ఆ బ్యాంకుల నుంచి షాకింగ్ సందేశం వచ్చింది. ఇక మా బ్యాంకులు విలీనం కాబోతున్నాయి అంటే సందేశంలో ఉంది. దీంతో ఖంగుతిన్న ఖాతాదారులు ఆందోళన చెందారు. అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఆ వివరాలు ఏంటో మీరూ చూసేయండి.
ప్రియమైన ఖాతాదారులకు భారత ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ నెంబర్ S.O. 1625(E), తేదీ 05.04.2025 ప్రకారం, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, మరియు సప్తగిరి గ్రామీణ బ్యాంక్లను విలీనం చేసి, వాటిని ‘‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్’’గా మారుస్తున్నారు. ఈ మార్పు 2025 మే 1 నుండి అమలులోకి వస్తుంది. మీ ఖాతాలు మరియు సేవలు యధాతథంగా కొనసాగుతాయి. మా బ్యాంకు పై మీరు చూపిన నమ్మకానికి మరియు మీ మద్దతుకు మనఃపూర్వక ధన్యవాదాలు. అంటూ గ్రామీణ బ్యాంకుల నుంచి మొబైల్కు సందేశాలు పంపించారు. ఇకపై గ్రామీణ బ్యాంకు సేవలు ఎలా ఉంటాయి. Andhra Pradesh Grameena Bank కార్యాలయాలు ఎక్కడ ఉంటాయి. ఎన్ని ఉంటాయి వంటి విషయాలపై ఇంకా స్పష్టత లేదు.
Andhra Pradesh Grameena Bank : ఇక గ్రామీణ బ్యాంకులు విలీనం
by గరుడ నేత్రం
Updated On: May 1, 2025 9:59 am
