టెలివిజన్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ శ్రీలంకలో AnasuyaBharadwa వెకేషన్ను ఎంజాయ్ చేస్తోంది. ఆమె పోస్టు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ప్రముఖ టెలివిజన్ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి శ్రీలంకలో సమ్మర్ వెకేషన్ను ఆస్వాదిస్తోంది. ట్రిప్ లో భాగంగా ఆమె దిగిన కొన్ని గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సిగిరియా హిల్స్ వద్ద ఉన్న ఓ లగ్జరీ రిసార్ట్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్వేర్ లో భర్తతో కలిసి దిగిన ఫోటోలను అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అనసూయ ఫ్యాషన్, గ్లామర్కు సంబంధించిన అభిప్రాయాలపై నెటిజన్ల మధ్య వాడీవేడి చర్చ జరుగుతోంది.

నెగెటివ్ కామెంట్లు – స్పందన:
కొంతమంది నెటిజన్లు – ‘‘ఇదేనా మీ పిల్లలకు నేర్పించేది?’’ అంటూ విమర్శలు చేస్తున్నారు. అనసూయ కుటుంబంతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ, ఆమె స్టైల్, ఫ్రీడమ్ పై అభిప్రాయభేదాలు కనిపిస్తున్నాయి.
కొత్త ఇంటి గృహప్రవేశం:
ఇటీవల అనసూయ కొత్త ఇంటిని కొనుగోలు చేసిన AnasuyaBharadwa విషయం తెలిసిందే. గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. శ్రీలంక ట్రిప్కు ముందు ఆమె శక్తి పీఠాలను దర్శించుకుంది.
