Nimmala Ramanaidu: మేస్త్రిగా మారిన మంత్రి.. జ‌నం ఫిదా

WhatsApp Image 2025-04-15 at 2.16.19 PM (1)

పాలకొల్లులో అంబేద్కర్ జయంతి వేడుకలలో మంత్రి రామానాయుడు పాల్గొని Nimmala Ramanaidu చింతపర్రు అరుంధతిపేటలో అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో స్వయంగా పాలు పంచుకున్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గంలోని చింతపర్రు అరుంధతిపేట లో అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో మంత్రి రామానాయుడు స్వయంగా శ్రమదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ త్యాగాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను,” అన్నారు.

స్వయంగా పైకి ఎక్కి పనులు చేసిన మంత్రి

విగ్రహ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేసిన మంత్రి, సెంట్రింగ్ పనుల్లో పాల్గొన్నారు. చెక్కలు అమర్చి, మేకులు కొట్టి, ఐరన్ కటింగ్ చేసి భుజాన ఎక్కించుకుంటూ కార్మికుల మాదిరిగానే పనిచేశారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా తాను పనిచేయడం ప్రజల్లో ఉద్వేగం కలిగించింది.

దశల వారీగా విగ్రహాల నిర్మాణం

రామానాయుడు తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విగ్రహాల నిర్మాణాన్ని దశల వారీగా పూర్తిచేస్తానని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు స్లాబులు వేసే పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు.

పూర్వ వైభవాన్ని తీసుకువస్తా

గత టిడిపి ప్రభుత్వంలో పాలకొల్లులో అంబేద్కర్ సామాజిక భవనాన్ని నిర్మించినప్పటికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో దానికి సరైన నిర్వహణ లేకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు.

జయంతి వేడుకల్లో పాల్గొన‌టం ఆనందంగా ఉంది

పాలకొల్లు పట్టణంలోని గాంధీ బొమ్మల సెంటర్, పూలపల్లి, 10వ, 16వ వార్డుల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి – విగ్రహాలకు పూలమాలలు వేసి అంబేద్కర్ కు ఘన నివాళులు Nimmala Ramanaidu అర్పించారు. వాడవాడలా జయంతి వేడుకలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన‌టం ఆనందంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు.

WhatsApp Image 2025-04-15 at 2.16.19 PM
WhatsApp Image 2025-04-15 at 2.16.19 PM

Leave a Comment