నేడు ఏపీలో పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా కూటమి నేతల Nandigama News సంబరాలు అంబరాన్నంటాయి. కార్యకర్తల హడావుడి సందడిగా మారింది. ఏ మూలన చూసినా బస్సులు ముస్తాబయ్యి సిద్ధంగా ఉన్నాయి. కార్యకర్తల సందడితో నాయకుల హడావుడితో పెద్ద పండగ వాతావరణమే కనిపిస్తుంది.
ప్రజా రాజధాని అమరావతి..
ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి నందిగామ నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా కదిలిన ప్రజలు. నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రతో బంగార్రాజు, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మండల కృష్ణకుమారి, కూటమి నేతలతో బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.

నేడు దేశ ప్రధాని నరేంద్రమోదీ అమరావతి రానున్న నేపధ్యంలో నందిగామలో నియోజకవర్గం నుంచి హడావుడి మొదలైంది. ఉదయం నుంచి వివిధ పార్టీ నాయకులు తమ పరిధిలోని కార్యకర్తలను సమన్వయం చేసుకున్నారు. అమరావతిలో జరుగుతున్న లక్ష కోట్ల అభివృద్ధి పనులకు నేడు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీనిలో భాగంగా రాష్రంలో పల్లె పండుగ వాతావరణం నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబు తలపెట్టిన కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. అమరావతి అభివృద్ధి పనుల కోసం జనం పయనమయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో కార్యకర్తల సందడి మాములుగా లేదు. ఎక్కడ చూసిన జనసేన కార్యకర్తల హడావుడే కనిపిస్తోంది. ఇక నందిగామ నియోజకవర్గం నుంచి కూటమి నేతలు, కార్యకర్తలు ప్రజలు అమరావతి దారులు పట్టారు.
టీడీపీ ఆధ్వర్యంలో..

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతి నిర్మాణం కోసం తలపెట్టిన బృహాత్కర కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఏపీ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నేడు అమరావతికి టీడీపీ శ్రేణులు భారీగా పయనమయ్యారు. మండల పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ బస్సలు సిద్ధం చేసి అమరావతికి పంపించారు. ఎండల తీవ్రత దృష్య్టా కార్యకర్తలకు అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో నందిగామలో టీడీపీ కార్యకర్తల జోష్ మాములుగా లేదు.
బీజేపీ ఆధ్వర్యంలో..

దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు నందిగామ పట్టణం నుంచి భారీగా పార్టీ శ్రేణులు పయనమయ్యాయి. నందిగామ బీజేపీ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య ఆధ్వర్యంలో కార్యకర్తల సమీకరణ జరిగింది. వారికి కావాల్సిన సదుపాయలను అందించి బస్సుల్లో అమరావతికి పయనమయ్యారు. దీంతో బీజేపీ ఆధ్వర్యంలో నందిగామ పట్టణంలో సందడి నెలకొంది. గత వారం రోజులుగా ప్రధాని పర్యటన నేపధ్యంలో కార్యకర్తలకు మార్గనిర్ధేశాలు, సమావేశాలు నిర్వహించారు.
కోగంటి బాబు ఆధ్వర్యంలో…

కంచికచర్ల పట్టణం నుంచి అమరావతి సభకు బస్సులు భారీగా పయనమయ్యాయి. ఉదయం నుంచి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సీఎం చంద్రబాబునాయుడు తలపెట్టిన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కోంగంటి బాబు అన్నారు. కార్యకర్తలకు అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేసి బస్సులో ప్రయాణం చేసే ప్రజలకు అన్ని సదుపాయయాలు కల్పించారు. దీంతో కంచికచర్ల నుంచి టీడీపీ కార్యకర్తలు అమరావతికి భారీగా వెళుతున్నారు.
జనసేన ఆధ్వర్యంలో..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో నందిగామ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు అమరావతి శంకుస్థాపన పనులకు సిద్ధమయ్యారు. నందిగామ జనసేన ఇన్ఛార్జి తంబళ్లపల్లి రమాదేవి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా సమావేశాలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు అమరావతికి వెళ్లాల్సిన విషయాలపై అవగాహన కల్పించారు. దీంతో నందిగామ నియోజకవర్గం నుంచి నేడు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు అమరావతికి పయనమయ్యాయి. దీనిలో భాగంగా జనసేన మండల పార్టీ అధ్యక్షుడు వడ్డెల్లి సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాసరబాద్ గ్రామం నుంచి అమరావతి పూన నిర్మాణం కోసం నరేంద్ర మోడీ రానున్న నేపధ్యంలో భారీగా జనసేన నాయకులు, కార్యకర్తలు అమరావతికి బయలుదేరి వెళ్లారు.
వీరులపాడు మండలంలో

పునర్నిర్మాణ సభకు వెళ్తున్న బస్సులను జండా ఊపి ప్రారంభించిన వెల్లంకి పార్టీ అధ్యక్షులు వీరులపాడు మండలంలో ని వెల్లంకి గ్రామం నుండి అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించిన గ్రామపార్టీ అధ్యక్షులు యర్రంరెడ్డి వెంకటేశ్వరరావు (పెద్దబ్బాయి) ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, పార్టీ Nandigama News కార్యకర్తలు పాల్గొన్నారు.


