Air India, Ahmedabad Crash : అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం – భారీ ప్రాణనష్టం

Plane Accident

ఈ రోజు మధ్యాహ్నం ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. Air India, Ahmedabad Crash అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా AI 171 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే బీజే మెడికల్‌ కాలేజీ భవనంపై కూలిపోయింది.

ముఖ్యాంశాలు:
మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయిన విమానం.

టేకాఫ్ అయిన వెంటనే మేఘాల మధ్య నిర్వాతానికి లోనై కాలేజీ భవనంపై కూలిపోయినట్లు తెలుస్తోంది.

విమానంలో మొత్తం 254 మంది ఉన్నారు — 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది.

20 మందికి పైగా మెడికల్‌ విద్యార్థులు మృతి, పలువురికి తీవ్ర గాయాలు.

169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ వాసులు, 7 పోర్చుగల్, 1 కెనడియన్‌ కూడా ఉన్నారు.

ఇద్దరు శిశువులు, 13 మంది చిన్నారులు ప్రయాణికులుగా ఉన్నారు.

విమానంలో మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు సమాచారం — వారి స్థితి గురించి స్పష్టత లేదు.

సహాయకచర్యలు:
ప్రమాదం తర్వాత వెంటనే బీఎస్ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సంఘటనా స్థలికి చేరాయి.

మూడు బృందాలుగా 90 మంది సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు.

సమీపంలోని పలు భవనాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.

అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్ తాత్కాలికంగా మూసివేత.

ఎయిరిండియా హెల్ప్‌లైన్ నంబర్: 1800 5691 444

ప్రయాణికుల కుటుంబాలకు సూచన:
విమాన ప్రయాణికుల వివరాలను తెలుసుకునేందుకు ఎయిరిండియా హెల్ప్‌లైన్‌ను సంప్రదించగలరు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Air India, Ahmedabad Crash వివరాలు అందే వరకు ప్రజలు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిసరాలకు చేరవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Comment