Adilabad school incident : విద్యార్థులపై విష ప్రయోగం ఎవరు చేశారంటే..?

Dharampuri village

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ధరంపూరి గ్రామంలో Adilabad school incident విషప్రయోగయత్నం కలకలం. అప్రమత్తమైన టీచర్ చర్యతో 30 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.

ఆదిలాబాద్, ధరంపూరి గ్రామం: ప్రభుత్వ పాఠశాలలో కలకలం రేపిన విష ప్రయోగయత్నం… ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు ఈ ఘాతుకానికి ఇపాల్పడ్డారు.

విద్యార్థులు త్రాగే నీరు నిల్వ ఉంచే ట్యాంకులో విష పదార్థాలు కలిపారు. అంతేకాదు, మధ్యాహ్న భోజనానికి వాడే వంట సామాగ్రికి పురుగుల మందు పూసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ వాసనను గుర్తించిన ప్రధానోపాధ్యాయురాలు అప్రమత్తమయ్యారు.

తన తెలివితేటలతో పిల్లలను త్రాగునీరు వైపు వెళ్లకుండా నిరోధించారు. మధ్యాహ్న భోజనాన్ని వండకుండా ఆపేశారు. ఆ నిర్ణయం వల్లే 30 మంది విద్యార్థులు పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

పాఠశాల ఆవరణలో పురుగుల మందు డబ్బా పడి ఉండటం, నీటిలో వాసన రావడం చూసిన టీచర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎవరు, ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. గ్రామస్తులు, తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని పిల్లల క్షేమాన్ని చూసి ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. అధికారులు Adilabad school incident ఈ ఘటనపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

school poisoning
school poisoning

Leave a Comment