విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు Durga Dasara Utsavalu 2025 జరుగనున్నాయి. అమ్మవారు 11 రోజుల పాటు 11 అలంకారాలలో దర్శనమిస్తారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శినా నాయక్ మరియు వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. మొత్తం 11 రోజుల పాటు 11 అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
దుర్గగుడి స్థానాచార్య శివప్రసాద్ శర్మ వివరాల ప్రకారం అమ్మవారి అలంకారాలు ఈ విధంగా ఉంటాయి:
దుర్గమ్మ అలంకారాలు (2025)
- సెప్టెంబర్ 22: బాలత్రిపుర సుందరి దేవి
- సెప్టెంబర్ 23: గాయత్రీ దేవి
- సెప్టెంబర్ 24: అన్నపూర్ణాదేవి
- సెప్టెంబర్ 25: కాత్యాయని దేవి
- సెప్టెంబర్ 26: మహాలక్ష్మి దేవి
- సెప్టెంబర్ 27: లలితా త్రిపుర సుందరి దేవి
- సెప్టెంబర్ 28: మహాచండి దేవి
- సెప్టెంబర్ 29: సరస్వతి దేవి
- సెప్టెంబర్ 30: దుర్గాదేవి
- అక్టోబర్ 1: మహిషాసుర మర్దిని దేవి
- అక్టోబర్ 2: రాజరాజేశ్వరి దేవి
ప్రత్యేక కార్యక్రమాలు
- అక్టోబర్ 2 ఉదయం 9:30కు: పూర్ణాహుతి తో ఉత్సవాల ముగింపు.
- అదే రోజు సాయంత్రం 5 గంటలకు: కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవం.
- సెప్టెంబర్ 29 (మూల నక్షత్రం మధ్యాహ్నం 3:30 – 4:30): సీఎం Durga Dasara Utsavalu 2025 అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.