చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రెనే జోషిల్డా ప్రేమ విఫలమై 11 Chennai bomb threat రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు పంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఒక ప్రేమ విఫలం యావత్ దేశాన్ని భయకంపితంగా మార్చింది. చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రెనే జోషిల్డా, ప్రేమించిన వ్యక్తి తనను తిరస్కరించాడన్న కోపంతో, దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులు పంపింది.
ప్రేమ విఫలమై… ప్రతీకార మార్గం:
ఒకే కంపెనీలో పని చేసిన సహోద్యోగి ప్రేమను తిరస్కరించాడన్న కోపంతో, రెనే అతడి పేరుతో నకిలీ ఈ-మెయిల్ IDలు సృష్టించింది. ఆ తర్వాత ప్రతిష్ఠిత విద్యాసంస్థలు, ఆస్పత్రులు, స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపించింది.
11 రాష్ట్రాల్లో కలకలం:
ఈమె పంపిన బాంబ్ అలర్ట్ మెసేజ్లు ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, మణిపూర్ రాష్ట్రాల్లో ఆందోళనకు గురిచేశాయి. కొన్ని చోట్ల స్కూల్లను ఖాళీ చేయించారు, కొన్ని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఓ తప్పిదమే అడ్డుగా:
తన కవర్ను కాపాడుకునేందుకు ఫేక్ ఐడెంటిటీలతో టెక్నికల్ మాస్టర్ ప్లాన్ వేసిన రెనే, ఒకసారి తన ఒరిజినల్ IP నుండి ఒక ఈమెయిల్ ఓపెన్ చేయడం వల్ల పోలీసులు ఆమెని ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల దర్యాప్తు:
సైబర్ క్రైమ్ విభాగం ఆమె ల్యాప్టాప్, మొబైల్, కమ్యూనికేషన్ ఆధారాలు స్వాధీనం చేసుకుంది. ఆమెపై కఠినమైన ఐటీ చట్టాలు, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే చర్యలపై సెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది.