గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై జాతీయAhmedabad plane crash దర్యాప్తు సంస్థ (NIA) తన దర్యాప్తును ప్రారంభించింది. ఈ ప్రమాదం కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిందా? లేదా దాని వెనుక ఎలాంటి కుట్ర కోణం దాగి ఉందా? అనే అనుమానాల నేపథ్యంలో అధికారులు కేసును తీవ్రతరంగా పరిశీలిస్తున్నారు.
మృతదేహం లభ్యం: అనుమానాలకు తావు
ఘటనాస్థలికి చేరుకున్న NIA బృందం శకలాల మధ్య ఒక డెడ్బాడీ (మృతదేహం)ను గుర్తించింది. ఇది ఎయిర్ క్రాఫ్ట్ లోని ప్యాసింజర్దా? లేదా ఎవరో ఇతర వ్యక్తిదా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
డీజీసీఏ ఆదేశాలు: శకలాలు తొలగించవద్దు
ఇప్పటికే పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) ప్రమాద ఘటనపై విచారణ మొదలుపెట్టింది. ప్రమాద స్థలాన్ని పూర్తిగా పరిశీలించేవరకు విమాన శకలాలను ఏ మాత్రం కదిలించవద్దని డీజీసీఏ అధికారులు ఆదేశించారు.
DGCA, NIA బృందాల సమీక్ష
కాసేపట్లో DGCA అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకోనున్నారు. శకలాల అధ్యయనం, బ్లాక్ బాక్స్ లభ్యత, ATC డేటా వంటి అంశాల ఆధారంగా Ahmedabad plane crash విచారణ జరపనున్నారు. ఈ ప్రమాదం వెనుక దుష్టశక్తుల హస్తం ఉందా? అనే కోణంలో కూడా గట్టిగా దృష్టి సారిస్తున్నట్టు సమాచారం.