stampede tragedy : హాఫ్ డే లీవ్ ప్రాణాలు తీసింది.. కొత్తజంట విషాదం..

Bangalore stampede

కోహ్లీ వీరాభిమానిగా చిన్నస్వామి స్టేడియానికి వెళ్లిన stampede tragedy  సీఏ గోల్డ్ మెడలిస్టు అక్షత, తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన పట్ల దేశమంతా షాక్‌కు లోనైంది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొత్త దంపతుల కల ఒక్కసారిగా చీకటి ముసుగులోకి వెళ్లిపోయింది.

అక్షయ్-అక్షత దంపతులు ఉత్తర కన్నడ జిల్లాకు చెందినవారు. ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నారు. అక్షత ఇటీవల జరిగిన చార్టెర్డ్ అకౌంటెన్సీ పరీక్షల్లో గోల్డ్ మెడల్ సాధించి కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది.

ఆర్సీబీ పోస్ట్ చూసి స్టేడియానికి ప్రయాణం…
కోహ్లీ వీరాభిమానిగా ఉండే అక్షత, ఆర్సీబీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చూసి హాఫ్ డే సెలవు పెట్టి చిన్నస్వామి స్టేడియానికి బయల్దేరారు. అభిమానుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో అక్షత తీవ్రంగా గాయపడగా, చికిత్సకు తీసుకెళ్లేలోపే మృతి చెందింది.

కుటుంబంలో విషాదం
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఉద్యోగంగా, విద్యగా నిలదొక్కుకుంటున్న క్షణాల్లో జరిగిన ఈ stampede tragedy సంఘటన అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.

Leave a Comment