2021లో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని TDP office attack సీఐడీ 127వ నిందితుడిగా చేర్చింది.
మంగళగిరి: టీడీపీ ప్రధాన కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను 127వ నిందితుడిగా చేర్చినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన 2021, అక్టోబర్ 19న జరిగింది. మాజీ వైసీపీ ప్రభుత్వ హయాంలో, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ అనుబంధ గుంపులు కర్రలు, రాళ్లతో విరుచుకుపడగా, కార్యాలయ గేట్ను ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకెళ్లారు. కార్యాలయ సిబ్బందిపై హత్యాయత్నానికి పాల్పడి, భారీ విధ్వంసం సృష్టించారు.
ఎంఎల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్, విజయవాడ తూర్పు వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో ఈ దాడికి పథక రచన జరిగినట్లు సమాచారం. వందలాదిమంది వైసీపీ శ్రేణులు, రౌడీ షీటర్లు, మహిళలు ఈ దాడిలో పాల్గొన్నట్లు చెబుతున్నారు.
ఈ ఘటనపై ప్రారంభంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా, అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసును పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది. ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఈ కేసును తిరిగి తెరపైకి తెచ్చి సీఐడీకి అప్పగించారు. దర్యాప్తులో భాగంగా కీలక మలుపుగా ఆర్కేపై కేసు నమోదు చేశారు.
పార్టీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన గత ప్రభుత్వ చర్యలను టీడీపీ వర్గాలు అప్పటి నుంచే తప్పుపడుతున్నాయి. తాజా కేసుతో ఈ అంశం మరింత రాజకీయం TDP office attack అయ్యే అవకాశాలు ఉన్నాయి.