డాక్టర్, ఐఏఎస్ అంటూ యూత్ను మోసం చేసిన Miryalaguda arrest కిలాడి సరిత అరెస్ట్ – పోలీసులను కూడా మాయ చేసిన మోసగాళ్ల కథా చిత్తరం.
హైదరాబాద్: డాక్టర్ ప్రత్యూషగా పేరుతెచ్చుకుంటూ, యువతను మోసం చేసిన కిలాడి లేడీ సరిత పోలీసుల బలయింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందిన సరిత అలియాస్ ప్రత్యూష, విద్యార్థిని ముసుగులో హాస్టల్లో నివసిస్తూ తోటి యువతుల సెల్ఫోన్లు, నగదు దొంగలించేది.
క్రమంగా మోసానికి కొత్త పుంతలు తొక్కుతూ తాను డాక్టర్, ఐఏఎస్, డీఎస్పీ కూతురు అంటూ అనేక ఖ్యాతిని కలిగిన పదవులను వాడుకుని డబ్బున్న వారిని టార్గెట్ చేసేది. ఒక వైద్యుడిని బెదిరించి రూ. 5 లక్షలు వసూలు, మరో యువకుడిని “డబ్బు ఇవ్వకపోతే చంపేస్తా” అంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల డయల్ 100కు కాల్ చేసి తాను డీఎస్పీ సతీమణిని అంటూ మోసం చేయడమే కాకుండా, ఒక యువతి హత్య జరిగిందంటూ పోలీసులను గందరగోళానికి గురిచేసింది. విచారణలో సరిత పైన చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ టూ టౌన్, మిర్యాలగూడ వన్ టౌన్, నార్కెట్పల్లి స్టేషన్లలో ఇప్పటికే చోరీ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
ఇటీవల ఒక చోరీ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణలో ఆమె గత మోసాలన్నీ వెలుగులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం Miryalaguda arrest సరితను రిమాండ్కు తరలించిన పోలీసులు, మరిన్ని కేసుల దర్యాప్తు ప్రారంభించారు.