సినిమాహాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, టికెట్ల Cinema Halls Policy ధరలు, ఆహార నాణ్యతపై నియంత్రణ అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. థియేటర్ల మూత వెనుక ఉన్న శక్తులపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా హాళ్ల నిర్వహణపై పకడ్బందీ ఉండాల్సిన అవసరం ఉందని, థియేటర్ల మూత వెనుక ఏ శక్తులున్నాయో తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు.
“జనసేన నాయకులు ఉన్నా చర్యలకు వెనకాడవద్దు” అని పవన్ స్పష్టం చేశారు. సినిమా హాళ్లలో ఆహార పదార్థాల నాణ్యత, ధరలపై నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
సినిమాటోగ్రఫీ శాఖ ఈ అంశాలపై సమన్వయం చేస్తుందని తెలిపారు. సినిమా టికెట్ ధరలు పెంచుకోవాలంటే ఫిలిం చాంబర్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలి, స్వచ్ఛందంగా పెంచడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.
“ఇది నా సినిమా హరిహర వీరమల్లుకు కూడా వర్తిస్తుంది” అని పవన్ తెలిపారు. ఏ సినిమా అయినా నిబంధనల ప్రకారం నడవాలని అన్నారు.
సినిమా రంగ అభివృద్ధికి ప్రత్యేక Cinema Halls Policy పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ విషయమై త్వరలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రకటించనున్నట్లు సమాచారం.