Jyoti Malhotra : పాక్ గూఢచారిణి జ్యోతి మల్హోత్రా: విచారణలో సంచలన నిజాలు!

Spy Case, Jyoti Malhotra

పహల్గామ్ దాడికి ముందు పర్యటన, పాక్ అధికారులతో సంబంధాలు, యూట్యూబ్ Jyoti Malhotra ద్వారా గూఢచర్యం — జ్యోతి మల్హోత్రా కేసులో తేలిన కీలక నిజాలు.

పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలపై హర్యానా యూట్యూబర్ అరెస్ట్

‘పహల్గామ్’ దాడికి ముందు ఆ ప్రాంతంలో జ్యోతి పర్యటన

ఢిల్లీ పాక్ ఎంబసీ అధికారితో నిరంతర సంబంధాలు

పాక్ అనుకూల ప్రచారానికి స్పష్టమైన ఆదేశాలు

విచారణలో కూడా పశ్చాత్తాపం లేని వైఖరి

యూట్యూబ్ చానెల్‌తో గూఢచర్యం?
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నడుపుతున్న ‘Travel with Jo’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ట్రావెల్ వ్లాగింగ్ పేరుతో అనేక వీడియోలు అప్లోడ్ చేసింది. అయితే విచారణలో పలు ఆశ్చర్యకర నిజాలు బయటపడుతున్నాయి.

పహల్గామ్ దాడి ముందు పర్యటన – అనుమానాస్పద వీడియోలు
పహల్గామ్ ఉగ్రదాడికి ముందే జ్యోతి ఆ ప్రాంతంలో పర్యటించిందని, అక్కడ వీడియోలు తీసినట్లు అధికారులు గుర్తించారు. ఆమె తీసిన ఈ కంటెంట్‌ను పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పహల్గామ్ దాడికి సంబంధించి పాకిస్థాన్ జవాబుదారీ కాదని ఆమె వీడియోలో పేర్కొనడం విచారణలో కీలక అంశంగా మారింది.

🇵🇰 పాక్ అధికారితో సంబంధాలు
జ్యోతి ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న డానిష్ అనే అధికారితో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. డానిష్, జ్యోతిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి, పాక్‌ అనుకూల కార్యకలాపాల్లో భాగం చేయించినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.

గూఢచారిణిగా ప్రయాణాలు?
జ్యోతి గతంలో పాకిస్థాన్‌కు పర్యటించినట్టు, చైనాలో కూడా కొన్ని రోజులు గడిపినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ప్రయాణాల నేపథ్యంలో ఆమె గూఢచారిణిగా పాకిస్థాన్‌కు సమాచారం అందించిన కోణంలో విచారణ కొనసాగుతోంది.

నిషేధిత సోషల్ మీడియా అకౌంట్లు
విచారణలో భాగంగా భారత ప్రభుత్వం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేసింది. ఆమె ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో నడిపిస్తున్న యూట్యూబ్ ఛానెల్ పై కూడా చర్యలు తీసుకోవాలని విచారణ సంస్థలు సూచిస్తున్నాయి.

పశ్చాత్తాపం లేకపోవడం – తీవ్ర విమర్శలు
పోలీసుల దర్యాప్తు ప్రకారం, జ్యోతి విచారణ సమయంలో తన చర్యలపై ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు.
తాను కేవలం వాక్ స్వాతంత్ర్యంను వినియోగించుకుంటున్నానని చెప్పారు. Jyoti Malhotra అయితే ఆమె పాక్ అనుకూల ప్రచారం కోసం ఆదేశాల మేరకు పని చేసినట్లు విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది.

Leave a Comment