వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి బలమైన ఎదురుదెబ్బ. కృష్ణా జిల్లా Kodali Nani వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం పార్టీకి రాజీనామా ప్రకటించి సంచలనం.
కొడాలి నాని రాజకీయానికి వైసీపీలో మరో వికెట్ డౌన్
ఫక్తు వైసీపీ నాయకులుగా చెలామణి అయిన వారికి ఇప్పుడు అసలు రాజకీయం ఏంటన్నది బోధపడుతోంది. నాడు అధికారమత్తులో నేతలు కొట్టిన డైలాగ్లకు గుడ్డిగా జేజేలు పలికిన నాయకులు.. ఇప్పుడు వాస్తవంలోకి వస్తున్నారు. తాము ఎంత మోసపోయామో, ఎంతలా మోసగించారో ఇప్పుడు అర్థం అవుతుందని రియలైజ్ అవుతున్నారు. కీలక నేతల గొడుగు కింద ఉండి ఇష్టారీతిన మాట్లాడామని, అదెంత తప్పో ఇప్పుడు తెలిసి వస్తుందని లెంపలు వేసుకుంటున్నారు.
కొడాలి నాని సన్నిహితుడి సంచలన ప్రకటన
మాజీ మంత్రి కొడాలి నానికి అత్యంత సన్నిహితుడు, కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం సంచలన ప్రకటన చేశారు. కొడాలి నాని వైఖరితో విసిగిపోయామని, ఇక రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు. నానిని నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో వరదలు ముంచెత్తినప్పుడు కనీసం బాధితులను పరామర్శించేందుకు కొడాలి నాని రాలేదని చెప్పారు.
వైసీపీలో విభేదాలు
ఎన్నికల తర్వాత మొత్తం పార్టీని గాలికి వదిలేశారని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను పట్టించుకోలేదని ఖాసిం ఆరోపించారు. నందివాడ మండలం మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కనీసం పరామర్శకు కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాముపై వ్యాఖ్యలపై క్షమాపణలు
ఎన్నికల సమయంలో గుడివాడ ఎమ్మెల్యే రాముపై చేసిన వ్యాఖ్యలపై ఖాసిం క్షమాపణలు కోరారు. రాము ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తున్నారని ప్రశంసించారు. ఎన్నికలు ముగియగానే రాము అమెరికా పారిపోతాడని తాము చేసిన ప్రచారం తప్పు అని అంగీకరించారు.
రాజకీయ సన్యాసం
కొడాలి నాని తనను తప్పుదోవ పట్టించారని, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియడం లేదని ఖాసిం పేర్కొన్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని ఖాసిం స్పష్టం చేశారు.
వైసీపీలో కలకలం
మొత్తానికి కొడాలి నాని ఖాతాలో వైసీపీ ఓ కీలక వికెట్ కోల్పోయింది. ఖాసిం Kodali Nani వ్యాఖ్యలు పార్టీ లోపల కూడా చర్చనీయాంశమవుతున్నాయి.