ప్రపంచ దేశాల్లో సంచరిస్తూ జీవితానుభవాలను యూట్యూబ్ ద్వారా పంచుకుంటూ పాపులారిటీ సొంతం చేసుకున్న యూట్యూబర్ ‘అన్వేషణ’ అన్వేష్ (Na Anvesh) ఇప్పుడు ఓ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వ ప్రముఖులపై తప్పుడు ఆరోపణలు చేశారన్న అభియోగంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై సుమోటోగా కేసు నమోదైంది.
డీజీపీ, మెట్రో ఎండీపై 300 కోట్ల ఆరోపణలు
తాజాగా అన్వేష్ ఒక వీడియోలో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎల్ రెడ్డి, అలాగే ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్ రాజ్ తదితరులు కలిసి బెట్టింగ్ యాప్ల ప్రకటనల ద్వారా రూ.300 కోట్లు గుట్టులో దాచారని ఆరోపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు.
పోలీసుల అభియోగాలు
సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో అన్వేష్ చేసిన వీడియో తప్పుడు, అవాస్తవ సమాచారం కలిగిఉందని, ఇది ప్రజల్లో గందరగోళం కలిగించేందుకు ప్రయత్నించిన ప్రచారంగా పేర్కొన్నారు. ప్రభుత్వాధికారులపై ద్వేషాన్ని రెచ్చగొట్టేలా వీడియో ఉండటంతో, తన ప్రేరణలతోనే కాకుండా సామాజిక బాధ్యతల్ని నిర్లక్ష్యం చేసినట్టుగా అభిప్రాయపడ్డారు.
ఎఫ్ఐఆర్ నమోదు – దర్యాప్తు కొనసాగుతోంది
ఈ అభియోగాల మేరకు సైబరాబాద్ సైబర్ పోలీస్ స్టేషన్ అధికారులు స్వయంగా సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించగా, అన్వేష్ స్పందన ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు అన్వేష్ అధికారికంగా స్పందించలేదు.
సామాజిక బాధ్యతపై చర్చ
ఈ ఘటనతో మరోసారి సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత అభిప్రాయాల Na Anvesh పరిధి, నైతిక బాధ్యతపై చర్చ మొదలైంది. ప్రజల విశ్వాసాన్ని, ప్రభుత్వ అధికారుల పరిపాలనను దెబ్బతీసేలా వ్యవహరించడమంటే వ్యక్తిగత స్వేచ్ఛ దాటివెళ్ళడం అవుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.