మైత్రీ మూవీ మేకర్స్ పోస్ట్కు రష్మిక రిప్లై.. విజయ్ దేవరకొండతో Telugu Movies మూడోసారి స్క్రీన్పై కనిపించనున్నారా? సోషల్ మీడియాలో చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్:
విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న జోడీ మరోసారి వెండితెరపై అలరించనున్నదా? ఫ్యాన్స్ అంచనాలకు బలం చేకూరేలా తాజాగా జరిగిన సోషల్ మీడియాలో ఒక పరిణామం సినిమాపరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత ఈ జోడీ ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేయనున్నారనే ఊహాగానాలు నెలకొన్నాయి. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తమ సోషల్ మీడియాలో “#HmmLetsSee” అంటూ రష్మికను ట్యాగ్ చేస్తూ చేసిన పోస్ట్కు, ఆమె ‘ఓకే..’ అంటూ నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇవ్వడం ఈ వార్తలకు మరింత బలం ఇచ్చింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ అనే ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. తదుపరి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుందని సమాచారం. ఇందులో హీరోయిన్గా రష్మిక మందన్నను ఎంపిక చేసినట్లు సినీవర్గాల సమాచారం.
గీత గోవిందం నుంచి మళ్లీ వెండి తెరకు?
విజయ్-రష్మిక కాంబోకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ‘గీత గోవిందం’తో వీరి జోడి భారీ హిట్ కొట్టగా, ‘డియర్ కామ్రేడ్’ యూత్ను బాగా ఆకట్టుకుంది. వీరి కెమిస్ట్రీకి అలానే మరోసారి తెరపై చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఇప్పుడు మూడోసారి ఈ జోడీ స్క్రీన్పై కనబడితే, Telugu Movies అది ప్రేక్షకులకు ఓ ట్రీట్గా మారుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.