Chandrababu Naidu : కలల సౌధం అమరావతి.. ఏపి ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య

Farmers Protest,

నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, అమరావతి Chandrababu Naidu పునఃప్రారంభ వేడుక రాష్ట్ర ప్రజల ఆశలకు నూతన దిక్సూచి అవుతుందని పేర్కొన్నారు.
ఆశల రాజధాని అమరావతి మరోసారి ప్రజల కలల సౌధంగా వెలసిందని, ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అమరావతి 2.0 పునఃప్రారంభం జరగడం చారిత్రాత్మక ఘట్టమని ఏపీ విప్, నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. శనివారం కాకానినగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వివరాలు వెల్లడించారు.

వెలగపూడి వేదికగా శుక్రవారం రూ.49,040 కోట్ల విలువైన నిర్మాణ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయని తెలిపారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, కేంద్ర నేతలు హాజరై అమరావతికి నూతన శక్తిని అందించారని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి అమరావతికి జేజేలు పలికిన సందర్భంలో, వారు చూపిన ప్రేమ, విశ్వాసానికి పాదాభివందనాలు తెలిపిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఈ వేడుక రాష్ట్ర ప్రజల ఆశలపై నూతన వెలుగు చిందించిందని చెప్పారు.

భూములిచ్చిన రైతుల త్యాగం ఎప్పటికీ మర్చిపోలేనిదని, గత ఐదేళ్లలో వారు ఎదుర్కొన్న అష్టకష్టాలు వర్ణించలేనివని అన్నారు. ‘‘ఇప్పుడు వారి కల నిజమవుతోంది. అమరావతికి మళ్లీ ప్రాణం పోసే ఈ ఘట్టానికి సాక్ష్యులవుతుండటం ఎంతో గర్వకారణం’’ అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమరావతి అభివృద్ధి శరవేగంగా జరిగే Chandrababu Naidu అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

Leave a Comment