దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపధ్యంలో నందిగామ పట్టణంలో సమావేశం Nandigama BJP News నిర్వహించారు. నందిగామ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు సమావేశం నిర్వహించి కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. మే 2 తేదీన జరగనున్న మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన సభకు నందిగామ నుంచి ప్రజలు, కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొని ప్రధానికి స్వాగతం పలకాలని సూచించారు. అమరావతి పనుల శంకుస్థాపనకు వస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఘనంగా స్వాగతం పలకాలని అన్నారు. ఆ రోజు లక్ష కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ మరియు కూటమి నేతలు అందరూ వేలాదిగా తరలిరావాలని ఎన్టీఆర్ జిల్లా బిజెపి ఇన్చార్జి నర్సింగ్రావు తెలిపారు.

గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నేతలు అందరూ పాల్గొని ఘనంగా స్వాగతం పలకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఇన్చార్జి మాదల రమేష్, కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య, మరియు జనసేన ఇన్చార్జి తంబళ్లపల్లి రమాదేవి పాల్గొన్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపధ్యంలో కార్యకర్తలకు Nandigama BJP News పాటించాల్సిన విధివిధానాలపై నాయకులు పలు సూచనలు చేశారు.
