ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ – అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే Amaravati Expressway Project 2025 నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశాలు
-
ఫిబ్రవరి 3న కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది.
-
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రతినిధులు హాజరైన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
-
ఆ సమావేశం మినిట్స్ను కేంద్రం ఇటీవలే ఏపీ, తెలంగాణ సీఎస్లకు పంపింది.
-
తాజాగా హైవే ప్రాజెక్ట్కి డీపీఆర్ (Detailed Project Report) తయారీని వేగవంతం చేయాలని కేంద్ర రోడ్లు, రవాణా శాఖను ఆదేశించింది.
ప్రాజెక్ట్ విశేషాలు
-
హైదరాబాద్ నుంచి అమరావతి వరకు హైస్పీడ్ ట్రావెల్ కోసం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే
-
రెండురాష్ట్రాల అభివృద్ధికి, పరిసర ప్రాంతాల ఎకనామిక్ గ్రోత్కి పెద్దపాళ్ళు
-
భారీ ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక రంగ అభివృద్ధికి దారి
తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్పై దృష్టి
-
తెలంగాణలో ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్ కోసం అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచనలు
-
మెట్రో, హైవే కనెక్షన్లకు గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులు మద్దతు ఇవ్వనున్న కేంద్రం